మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)
ఎనిమిదేళ్ళకే గణ, యతి ప్రాసలంటే తెలియకుండానే తన మొదటి గీతం రాసి, పదో ఏటే తన మొదటి నవల రాసి, పదిహేనేళ్ళకే ఒక నవల అచ్చు వేయించి, పద్దెనిమిదేళ్ళకే ఖండకావ్య సంపుటి రాసి, తండ్రిగారు ఇచ్చిన డబ్బుతో దాన్ని అచ్చు వేయించి అలా అడుగేసిన శ్రీశ్రీ.. ఈ శతాబ్దం నాదంటూ నినదించి, నడిపించిన శ్రీశ్రీ.. "సినిమాకవికి సినిమా నిర్మాణంలో తనదిగా చెప్పుకోవడానికి ఏమీలేదు కనుక.. నేను తెలుగు సినిమాకవినని చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పుకుంటాను.., కాకపోతే నా ఆశయాలనీ, భావాలనీ లక్షలాది ప్రజలకి తెలియజేయటానికి "సినిమా"ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాను" అని చెప్పాడు. ఒక్కసారి శ్రీశ్రీ సినీరచనలను గమనిస్తే ఎన్నో పార్శ్వాలు. " నా హృదయంలో నిదురించే చెలీ.. (ఏ.ఎన్.ఆర్. ఆరాధన)" అంటూ ప్రేమ పాట రాసి, ఆ చెలి ఎవరని అడిగితే.. "కమ్యూనిస్ట్ పార్టీ" అని సమాధానమిచ్చిన చతురుడు. " కూటికోసం కూలి కోసం.. (ఆకలిరాజ్యం)" అంటూ ఆకలి కేకలు వినిపించి, క ష్టజీ వి కి ఇరువైపులా నిలిచిన వాడే కవి అని నిరూపించినవాడు. ఎవరిమీదా ఆధారపడకుండా, మనిషి ముందు తనని తాను నమ్ముకోవాలని చెబుతూ.. " ఎవరో ...